Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

టీడీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం

మంగళగిరిలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభమైంది. పార్టీ సంస్థాగత నిర్మాణంతో పాటు బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై నేతలతో చర్చిస్తున్నారు. టీడీపీ ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు రాష్ట్రానికి ఇదేం కర్మ అనే కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రారంభించడంతో పాటు కార్యక్రమం ఎజెండాను పార్టీ నేతలకు వివరించనున్నారు. ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. వచ్చే రెండు నెలల్లో యాభైకి పైగా నియోజకవర్గాల్లో రోడ్‌ షోలు నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img