టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అపాయింట్మెంట్ ఖరారైంది. దీంతో చంద్రబాబు నాయుడు, పార్టీ ముఖ్యనేతలు సోమవారం దిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు సమయమిచ్చినట్లు రాష్ట్రపతి వర్గాలు పేర్కొన్నాయి. ఐదుగురు నేతలకు సమయమిచ్చినట్లు వెల్లడిరచాయి. రాష్ట్రంలో ఆర్టికల్ 356 ప్రయోగించాలని కోవింద్కు చంద్రబాబు ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రపతితో పాటు పలువురు కేంద్ర పెద్దలను చంద్రబాబు బృందం కలవనుంది.