Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

టీడీపీ సీనియర్‌ నేత యడ్లపాటి వెంకట్రావు కన్నుమూత..

చంద్రబాబు సహా పలువురు సంతాపం..
టీడీపీ సీనియర్‌ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు (104) కన్నుముశారు. గత కొన్ని రోజులుగా అనార్యోగంతో బాధపడుతున్న యడ్లపాటి సోమవారం తెల్లవారుజామున హైదరాబాద్‌?లోని తన కూతురు నివాసంలో తుదిశ్వాస విడిచారు. యడ్లపాటి టీడీపీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా పని చేశారు. అంతేకాకుండా రైతు నాయకుడిగా, సంగం డైయిరీకి మొదటి అధ్యక్షుడిగా వెంకట్రావు విశేష సేవలందించారు.టీడీపీ సీనియర్‌ నేత మృతిపట్ల పలువురు నాయకులు సంతాపం తెలిపారు.కాగా.. మాజీ మంత్రి, మాజీ రాజ్యసభ సభ్యులు యడ్లపాటి వెంకట్రావు మృతి పట్ల టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన యడ్లపాటి రాజకీయ జీవితం ఎంతో ఆదర్శప్రాయంగా సాగిందంటూ చంద్రబాబు పేర్కొన్నారు. యడ్లపాటి జీవితం ప్రతీతరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా యడ్లపాటి కుంటుంబ సభ్యులకు చంద్రబాబు సానుభూతి తెలియజేశారు. ఆయనతోపాటు అచ్చెన్నాయుడు, ధూళిపాళ్ల నరేంద్ర, ఆనందరావు, ప్రత్తిపాటి తదితర నాయకులు సంతాపం తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img