గుండెపోటుతో మృతిచెందిన తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి భౌతికకాయానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నివాళులర్పించారు. దిల్లీ నుంచి రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా తిరుపతిలోని డాలర్ శేషాద్రి నివాసం వద్దకు చేరుకుని పార్ధీవదేహంపై పుష్పగుచ్చం ఉంచి అంజలి ఘటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ శేషాద్రి స్వామి ఇక లేరన్నది నమ్మలేకపోతున్నానన్నారు. ఆయన లేకుండా తిరుమలకు రావడం ఉహించలేనిదన్నారు.శేషాద్రి స్వామి ఆలయ నిర్వహణపై రచించిన పుస్తకాలను టీటీడీ ముద్రించి భక్తులకు అందుబాటులో తీసుకురావాలని ఎన్వీ రమణ సూచించారు.