వైసీపీ నేతలు తమ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారంటూ టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ కార్యకర్త మురళీపై దాడి ఘటన నేపథ్యంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమరావతి డీజీపీ గౌతమ్ సవాంగుకు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.మురళీకి ప్రాణానికి హాని జరిగితే ప్రభుత్వానిదే బాధ్యతని ఆ లేఖలో పేర్కొన్నారు. మురళికి రక్షణ కల్పించాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే చంపుతామని బెదిరిస్తున్నారని అన్నారు. నిందితులను తక్షణమే పోలీసులు అరెస్ట్ చేయాలని, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.