Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇంట్లో ఈడీ దాడులు..

తాడిపత్రిలో జేసీ నివాసంపై ఈడీ దాడులు నిర్వహించింది. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌ రెడ్డి ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డెరైక్టరేట్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో వాహనాల రిజిస్ట్రేషన్లపై ఆరా తీస్తున్నారు. జేసీ ట్రావెల్స్‌ స్క్రాప్‌ కింద వాహనాలు కొనుగోలు చేసి నకిలీ ఇన్వాయిస్‌తో నాగాలాండ్‌లో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సుమారు వందకుపైగా వాహనాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించినట్టు భావిస్తున్నారు. మరోవైపు జేసీ ముఖ్య అనుచరుడు చవ్వాగోపాల్‌ రెడ్డి ఇంటి పైనా దాడులు కొనసాగుతున్నాయి. వారి ఆస్తులకు సంబంధించిన పత్రాలను మొత్తం 20 మంది సిబ్బంది పరిశీలిస్తున్నారు. తాడిపత్రిలో భారీ బందోబస్తు నడుమ ఈ సోదాలు కొనసాగుతున్నాయి. మరోవైపు హైదరాబాద్‌లోనూ జేసీ సోదరుల నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img