వరదలో చిక్కుకొని నవవధువు మృతి
తిరుపతిలో తీవ్ర విషాదం నెలకొంది. అర్ధరాత్రి కురిసిన భారీ వర్షం కురిసింది. శ్రీవారిని దర్శించుకోవడానికి ఓ కొత్త జంట బంధువులతో కలిసి తిరుపతికి వచ్చారు. వరదనీటిలో వారి వాహనం చిక్కుకోవడంతో ఊపిరాడక నవవధువు ప్రాణాలు కోల్పోయింది. వివరాల్లోకి వెళితే, కర్ణాటకలోని రాయ్చూర్కు చెందిన పెళ్లి బృందం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుపతి వచ్చారు. అయితే శుక్రవారం అర్థరాత్రి తిరుమలో కురిసిన భారీ వర్షానికి తిరుపతి బాలజీ కాలనీ నుంచి ఎమ్మార్ పల్లెకి వెళ్లే దారిలో వెస్ట్ చర్చిసమీపంలోని రైల్వే అండర్పాస్ బ్రిడ్జి నీటి మునిగింది. బ్రిడ్జి వద్ద వరదలో నవజంట ప్రయణిస్తున్న తుఫాన్ వాహనం చిక్కుకుంది. వాహనంలో ప్రయాణిస్తున్న ఏడుగురు నీటిలో పూర్తిగా మునిగిపోయారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, వాహనంలోని ఆరుగురిని కాపాడారు. వాహనం నుంచి బయటకు రాలేక నవవధువు ప్రాణాలు కోల్పోయింది.