తిరుమలలో ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేశారు. చిన్నపాటి గొడవ వల్లే బండ రాయితో దుండగుడు దాడిచేసినట్లు తెలుస్తోంది.బుధవారం రాత్రి ఎస్వీ మ్యూజియం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు తమిళనాడు ఆరని జిల్లాకు చెందిన శరవణగా సమాచారం. సంఘటన స్థలంలోని సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దుండగుడిని గుర్తించారు. హతుడు తమిళనాడు వేలూరు జిల్లా గుడియాత్తంకు చెందిన భాస్కర్గా పోలీసులు గుర్తించారు. అదుపులోకి తీసుకున్న నిందితుడిని కాసేపట్లో మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.