తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సర్వ దర్శనం టోకెన్లు ఇకపై ఆన్లైన్ ద్వారా విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడిరచారు. ఈనెల 25 ఉదయం తొమ్మిది గంటలకు టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. రోజుకు 8వేల టోకెన్లను భక్తులకు అందుబాటులో ఉంచనుంది. అక్టోబర్ 31 వరకు సర్వదర్శనం టోకెన్లను టీటీడీ వెబ్సైట్లో విడుదల చేయనుంది.