బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉన్న అల్పపీడనం గురువారం ఉదయం వాయుగుండంగా బలపడిరది.ఇది చెన్నై తీరానికి దగ్గరలో ఉందని, దీని వలన ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో వర్షాల తీవ్రత కూడా పెరుగుతుందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఈ వాయుగుండం ఈ రోజు ఉదయం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య తీరాన్ని దాటింది. దీంతో చిత్తూరు, కడప, అనంతపురం, నెల్లూరు , ప్రకాశం జిల్లాల్లో రానున్న రెండు, మూడు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. , కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒకటిరెండు చోట్ల భారీవర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొంది.శనివారం ప్రకాశం, నెల్లూరు, అనంతపురం జిల్లాలో ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపారు. భారీవర్షాలు పడే జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరికలు, విశాఖపట్నం పోర్టులో రెండో నంబరు, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు.. గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని వాతావరణ అధికారులు తెలిపారు. రెండురోజుల పాటు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.