ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నల్గొండ జిల్లా హుజూర్నగర్లో ఎన్నికల నియమావళి ఉల్లంఘించారన్న కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. 2014లో అనుమతి లేకుండా రోడ్షో నిర్వహించారని జగన్పై అభియోగాలు నమోదయ్యాయి. విచారణకు హాజరుకావాలని జగన్కు ఇటీవల ప్రజాప్రతినిధుల కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో కోర్టును జగన్ ఆశ్రయించారు. జగన్ హాజరుపై ఏప్రిల్ 26 వరకు తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది.