40లక్షల మందికి తెలుగు ` ఇంగ్లీషు నిఘంటువులు
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : తెలుగు భాషా భివృద్ధి పరిధి పెంపునకు చర్యలు తీసుకున్నామని, నిర్వీర్యమైన తెలుగు అకాడమీకి పూర్వ వైభవం తీసుకొ స్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడిర చారు. విజయవాడలోని ఆర్అండ్బీ భవన సముదాయంలో తెలుగు అకాడమీ చైర్పర్సన్ నందమూరి లక్ష్మీపార్వతితో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలుగు, సంస్కృత భాషా అకాడమీ ఏర్పాటు ఆవశ్యతకపై చర్చించినట్లు మంత్రి సురేష్ చెప్పారు. 40 లక్షల మంది విద్యార్థులకు తెలుగు నిఘంటువును పంపిణీ చేశామన్నారు. తెలుగు భాషా ఔన్నత్యానికి మరింత ప్రాచుర్యం కల్పించడంతోపాటు వివిధ భాషలకు మూలమైన సంస్కృత భాషనూ అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో తెలుగు అకాడ మీని తెలుగు సంస్కృత అకాడమీగా మారుస్తూ జీవో నంబరు
31 విడుదల చేసినట్లు తెలిపారు. తెలుగు సంస్కృత భాషా అకాడమీ ఏర్పాటుపై శాసనసభలో చర్చిం చామని, మంత్రివర్గం ఆమోదించిందన్నారు. దీనిని ప్రతిపక్ష నాయకులతోపాటు కొందరు ప్రముఖులు విమర్శించడం సరికాదన్నారు. గత ప్రభుత్వం తెలుగు అకాడమీని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, రాష్ట్రవిభజన అనంతరం ఏనాడూ తెలంగాణ రాష్ట్రంతో తెలుగు అకాడమీపై సంప్రదింపులు చేపట్టలేదని విమర్శించారు. అకాడమీ ఆస్తులు, ఉద్యోగుల జీతభత్యాలను పట్టించుకున్న వారే లేరన్నారు. అకాడమీ ద్వారా పాఠ్యపుస్తకాల ముద్రణను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టి విద్యార్థులకు సకాలంలో పాఠ్యపుస్తకాలనూ అందించలేని దుస్థితికి తీసుకొచ్చారని చెప్పారు. తెలుగు అకాడమీ ద్వారా తెలంగాణ నుంచి మన రాష్ట్రానికి రావాల్సిన స్థిర చరాస్థులపై న్యాయపోరాటం చేశామన్నారు. దీనిలో భాగంగా హైకోర్టులో వ్యాజ్యం వేయగా..విభజన చట్టం ప్రకారం 52:48 నిష్పత్తిలో అకాడమీ ఆస్తులు పంపకాలు చేసుకోవాలని తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు. తద్వారా రూ.200కోట్ల స్థిరచరాస్తులు దక్కించుకోగలి గామని పేర్కొన్నారు. తెలుగు భాష ఔన్నత్యాన్ని కాపాడుతూ ఇంగ్లీషు బోధననూ ప్రవేశపెట్టామని చెప్పారు. నందమూరి లక్ష్మీపార్వతి మాట్లాడుతూ తెలుగు భాషలో హిందీ, పార్సీ, సంస్కృతం తదితర భాషలు అంతర్లీనంగా ఉన్నాయని చెప్పారు. సంస్కృత పదం వాడకుండా ఇతర భాషాల్లో ఏ ఒక్క పదమూ మాట్లాడలేమని స్పష్టంచేశారు. శాసనాలను పరిశీలిస్తే ఈ విషయం విదితమవుతుందని, అప్పటి నుంచే తెలుగు భాషకు సంస్కృత భాషకు విడదీయ లేని బంధం ఏర్పడిరదన్నారు. తెలుగు సంస్కృత అకాడమీ ఏర్పాటుకు సీఎం వైఎస్ జగన్..తిరుపతిలో నాలుగు అంతస్తుల భవనాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు తెలిపారు. అకాడమీ ద్వారా ఈ ఏడాది ఇంటర్మీడియట్ పాఠ్యపుస్తకాలు ముద్రిస్తున్నామన్నారు. రాబోయే సంవత్సరం నుంచి అన్ని పోటీ పరీక్షలకు సంబంధించిన పాఠ్యపుస్తకాలు ముద్రించేందుకు చర్యలు తీసుకోబోతున్నామని చెప్పారు.