తెలుగు రాష్ట్రాల్లో ఉష్టోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. కొన్ని జిల్లాల్లో సింగిల్ డిజిట్కు సైతం పడిపోయాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లేందుకు గజగజ వణుకుతున్నారు. ఉదయం 10 గంటల వరకు పొగమంచు కప్పుకునే ఉంటుంది. పొగమంచు కారణంగా కొన్ని కోట్ల రోడ్డు ప్రమాదాలు సైతం చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ విషయానికి వస్తే ముఖ్యంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో 8.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 9 డిగ్రీల ఉష్టోగ్రత నమోదైంది. మరోవైపు కొమురంభీం జిల్లాలో 11, మంచిర్యాల 12, ఆదిలాబాద్ 13, నిర్మల్ 13.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. అల్లూరి జిల్లా మినుములూరులో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఏపీ విషయానికి వస్తే.. పాడేరు 12, అరకులోయలో 12 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొసాగే పరిస్థితి ఉన్నట్లు కనిపిస్తోంది. అటవీ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న జిల్లాలో ప్రజల బాధలు వర్ణణాతీతంగా మారాయి. చలి మంటలు వేసుకుని కాచుకుంటున్నారు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాలపై చలి పంజా విసురుతుంది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.