Wednesday, April 24, 2024
Wednesday, April 24, 2024

తెలుగు రాష్ట్రాలు దివాలా తీశాయి : కేఏ పాల్‌

తెలుగు రాష్ట్రాలు దివాలా తీశాయని కేఏ పాల్‌ అన్నారు. రెండు రాష్ట్రాలూ ఒకటైతే అప్పులు తీర్చి ఐదేళ్లలో అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఏపీ నాశనమైపోయిందని, బాగా డబ్బున్న తెలంగాణ కూడా నాశనమైపోయిందన్నారు. ప్రజలు దోచుకునేవారిని ఎన్నుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దేశం నాశనం అవ్వడానికి రాజకీయ నేతలు కాదని.. ప్రజలేనన్నారు. ఇప్పటికైనా అందరం కలిసి పోరాడుదామని పిలుపు నిచ్చారు. జయప్రకాష్‌ నారాయణ చాలా మంచివారని.. అలాంటి వారు కావాలా.. వద్దా..?అని ప్రశ్నించారు. వివేకాను చంపిన వారిని వెంటనే పట్టుకుని శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img