ఏపీ పర్యాటకానికి త్వరలో ఒక యాప్ తీసుకురాబోతున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. దసరాకు టూరిజం యాప్ సిద్ధమవుతుందని తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పర్యాటన ప్రాంతాల వివరాలను ఆన్లైన్లో ఉంచుతామని పేర్కొన్నారు. స్థానిక పర్యాటకులను ఆకట్టుకునేలా ప్రత్యేక ప్యాకేజిలు రూపొందిస్తామని వెల్లడిరచారు.27న ప్రపంచ పర్యాటక దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని ప్రకటించారు. హరిత హోటళ్లను బ్రాండిరగ్ చేసేలా అధికారులను ఆదేశించామన్నారు. విశాఖ, పిచ్చుకలంక, సూర్యలంక, గండికోటతో పాటు 13 చోట్ల 5 స్టార్ హోటళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి హోటళ్లను నిర్మిస్తామని చెప్పారు. ప్రసాదం పథకం కింద శ్రీశైలంలో అభివృద్ధి చేశాం.. సింహాచలంలో ఆ పథకం కింద రూ.50 కోట్లతో అభివృద్ధి చేస్తామని వివరించారు.