జనసేన అధినేత పవన్ కళ్యాణ్
దామోదరం సంజీవయ్య రెండేళ్లే పదవిలో ఉన్నా ఎంతో సేవ చేశారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొనియాడారు. వరదరాజుల ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల కోసం అనేక విధానాలు అమలు చేశారని ఆయన అన్నారు. తెలుగు భాషలోనే ఉత్తర, ప్రత్యుత్తరాలు నడపాలని ఆదేశించారని చెప్పారు. వెనుకబడిన తరగతులవారికి రిజర్వేషన్ల కోసం సంజీవయ్య కృషి చేశారన్నారు. ఇటువంటి మహనీయుడు పేరు నేటి తరాలకు తెలియకుండా చేశారని మండిపడ్డారు. బూరుగుల రామకృష్ణ స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవిని వదిలేసుకున్నారని, పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాక ఎన్నో ఆర్ధిక సంస్కరణలు తెచ్చారని గుర్తుచేశారు. పాలకులు అటువంటి మహనీయుల త్యాగాలను కనీసం గుర్తు చేసుకోవడం లేదన్నారు.కోటి రూపాయల నిధులు సేకకరించి… దామోదరం సంజీవయ్య స్మారక భవనాన్ని నిర్మిస్తామని ప్రకటించారు. కర్నూలు జిల్లాలోని పెదపాడులో ఉన్న ఆయన ఇంటిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. కడప జిల్లాకు వైఎస్సార్ అని పేరు పెట్టినప్పుడు.. కర్నూలు జిల్లాకు దామోదర సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.