నేడు, రేపు కేంద్ర హోంశాఖ చింతన్ శిబిర్
‘విజన్ 2047’ లక్ష్యంగా కేంద్ర హోంశాఖ ఏర్పాటు చేసిన చింతన్ శిబిర్ (మేథోమథనం)లో ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి తానేటి వనిత పాల్గొననున్నారు. గురు, శుక్రవారాల్లో హర్యానాలోని సూరజ్కుండ్లో జరగనున్న ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల హోంమంత్రులు, డీజీపీలు, హోంశాఖ ఉన్నతాధికారులను కేంద్ర హోంశాఖ ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఈ సదస్సులో పాల్గొనేందుకు ఒక రోజు ముందుగానే ఏపీ హోంమంత్రి తానేటి వనిత దిల్లీ చేరుకున్నారు. బుధవారం దిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, అదనపు రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌశిక్తో ఆమె సమావేశమయ్యారు.