వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి
దిల్లీ లిక్కర్ స్కామ్లో దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటూ పోతాయని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అన్నారు. ఈ కేసుకు సంబంధించి మాగుంటకు చెందిన నివాసాల్లో ఈడీ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ… దేశంలో అనేక చోట్ల దర్వాప్తు సంస్థలు సోదాలు, విచారణలు జరుపుతున్నారని చెప్పారు. దిల్లీ లిక్కర్ వ్యాపారంతో తమకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సంబంధం లేదని అన్నారు. దేశంలో లిక్కర్ కు సంబంధించి రెడ్డి అనే పేరు వస్తే… మాగుంట శ్రీనివాసులు రెడ్డే అంటారని.. అది మంచో, చెడో తనకు తెలియదని చెప్పారు. గత 70 ఏళ్లుగా తమ కుటుంబం లిక్కర్ బిజినెస్లో ఉందని… అందుకే అందరూ తన గురించి అనుకుంటారని అన్నారు. తనకు, తన కొడుకుకి ఢల్లీి లిక్కర్ తో సంబంధం లేదని తెలిపారు. మాగుంట ఆగ్రో ఫామ్ పేరు రావడంతో అందరూ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అంటున్నారని… అయితే అది తమ బంధువులదని చెప్పారు. తమ వ్యాపారానికి సాయం చేయమని తాను ఏ సీఎంని కూడా అడగలేదని అన్నారు. తన వ్యాపారాలకు తన ఎంపీ హోదాను ఎక్కడా వాడుకోలేదని చెప్పారు.