Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

దివాళా దిశగా..రాష్ట్రం…

గోరంట్ల బుచ్చయ్యచౌదరి
రాష్ట్రం ఆర్థికంగా దివాళా దిశగా పయనిస్తోందని, అప్పులమయమైన రాష్ట్రం, త్వరలోనే చీకట్లపాలు కానుందని టీడీపీ పొలిట్‌ బ్యూరోసభ్యుడు, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. ఆఖరికి గవర్నర్‌ను కూడా ఈ ప్రభుత్వం తమ స్వార్థానికి వాడుకుందంటే ఈ ప్రభుత్వం ఎటుపోతోందో చెప్పాల్సిన పనిలేదన్నారు. కాంట్రాక్టర్లకు బకాయిలు, ఉద్యోగులకు జీతాలు, పింఛన్లు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వముందని విమర్శించారు. ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం కదా అని.. వారికేదో ధర్మం చేస్తున్నట్టుగా సజ్జల మాట్లాడుతున్నారని అన్నారు. 3 లక్షల కోట్లు అప్పులు తెచ్చినా.. సకాలంలో ప్రభుత్వం ఎందుకు జీతాలివ్వడంలేదని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img