Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

దిశ యాప్‌ను వినియోగించి రక్షణ పొందాలి

రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత
ప్రతి విద్యార్థిని, మహిళ, ఉద్యోగిని దిశ యాప్‌ను వినియోగించి రక్షణ పొందాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత కోరారు.‘దిశ’ యాప్‌ తమ ఫోనులో ఉంటే మన అన్న మనవెంట ఉన్నట్లేనని అన్నారు. శుక్రవారం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన దిశ ఆర్గనైజేషన్‌ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థిని తమ ఫోన్‌లో దిశయాప్‌ను ఏవిధంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలో వివరించారు. సుమారు కోటి మందికి పైగా దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వినియోగిస్తున్నారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img