దీపావళి పండుగ సందర్భంగా వేర్వేరు ప్రాంతాలకు నాలుగు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నామని దక్షిణ మధ్య రైల్వే అధికారులు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. 23న తిరుపతి- సికింద్రాబాద్ ప్రత్యేకరైలు(07481), 24న సికింద్రాబాద్-తిరుపతి(07482), 23న నాందేడ్-హడప్సర్ (07403), 24న హడప్సర్- నాందేడ్ (07404)ను నడుపుతున్నట్టు పేర్కొన్నారు.