Friday, April 19, 2024
Friday, April 19, 2024

దేశాన్ని అగ్రగామిగా నిలపాలి : చంద్రబాబు

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరులోని చేబ్రోలు హన్‌మయ్య కంపెనీ ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను శాలువాతో సన్మానించారు. చంద్రబాబు మాట్లాడుతూ.. దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిపేందుకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పని చేయాలని అన్నారు. నేటి యువతలో జాతీయతను, దేశభక్తిని పెంచవలసిన అవసరముందని పేర్కొన్నారు. నేడు దేశం అన్ని రంగాల్లో ముందుకు పరిగెడుతుందని తెలిపారు. నాడు నెహ్రూ నుంచి నేటి ప్రధాని మోదీ వరకు దేశం కోసం ఎన్నో చేస్తున్నారని కొనియాడారు. పేద ప్రజల మేలు కోసం ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img