Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

దొంగ ఓట్ల సంస్కృతి ఎవరిదో అందరికీ తెలుసు

: మంత్రి బొత్స

ఏపీలో ముమ్మాటికీ మూడు రాజధానులు ఉంటాయని, అడ్డుకోవడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆపలేరని స్పష్టం చేశారు. రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు స్థాయి దిగజారి మాట్లాడుతున్నారని, దొంగ ఓట్ల సంస్కృతి ఎవరిదో అందరికి తెలుసని అన్నారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ, కుప్పం మున్సిపల్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కుప్పంకి నీళ్ళు ఇవ్వలేదని అనడానికి చంద్రబాబుకు సిగ్గుగా అనిపించడం లేదా? అని మండిపడ్డారు. 40 ఏళ్ళు కుప్పానికి ఎమ్మెల్యే ఎవరున్నారని ప్రశ్నించారు. ఓడిపోతామని తెలుసు కాబట్టే దొంగ ఓట్లు, అల్లర్లు అంటూ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పెయిడ్‌ ఆర్టిస్టులతో యాత్ర జరుగుతోందన్నారు. లోకేష్‌ ఎన్ని జన్మలెత్తినా ఎమ్మెల్యే అవ్వగలడా అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img