శాండ్, ల్యాండ్, వైన్, మైన్ దోపిడీతో వైసీపీ నేతలు జేబులు నింపుకుంటున్నారని మాజీ మంత్రి పీతల సుజాత అన్నారు. నేడు పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మీడియాతో మాట్లాడారు. మొదటి నుంచి గత ప్రభుత్వాలు చేసిన పనులను తాము చేసినట్టు రంగులు వేసుకుని ప్రభుత్వం గొప్పలు చెప్పిందని అన్నారు. ఇప్పుడైతే ఏకంగా 83 నుంచి ప్రభుత్వాలు పేదలకు కట్టించిన పక్కా ఇళ్ల మీద పట్టాల పేరుతో వన్ టైం సెటిల్మెంట్ అంటూ వేల కోట్లు గుంజుతోందని అన్నారు. ప్రజలు ఎవరూ కూడా ప్రభుత్వానికి డబ్బులు కట్టనవసరం లేదని అన్నారు. రేపు వచ్చేది టీడీపీ ప్రభుత్వమే కనుక పేదలందరికీ ఉచితంగా పట్టాలు అందజేయడం జరుగుతోందని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పాలన చేయకుండా తమ ఇష్ట ప్రకారం చేయాలని చూస్తోందని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్… ఇలాంటి పాలకులు వస్తారనే బాబాసాహెబ్ అంబేద్కర్ పటిష్టమైన రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేసి ఎవరైనా సరే రాజ్యాంగానికి లోబడి పనిచేసేలా చట్టాలు రూపొందించారన్నారు. ఈరోజు వైసీపీ ప్రభుత్వం రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ పాలన సాగిస్తూ పేదలను దోచుకుంటోందని అన్నారు.