ధరల పెంపులో జగన్వి చావు తెలివితేటలని టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు.ఈ దిక్కుమాలిన పాలన గురించి పిల్లలకూ అర్ధమైందని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆస్తుల కబ్జాలకు సీఎం, ఎమ్మెల్యేలు తీవ్రవాదుల్లా తయారయ్యారని అన్నారు. ‘‘జగన్ నుంచి విముక్తి పొందండి.. ఆంధ్రాను రక్షించండి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. తాను డిమాండ్ చేశాకే పోలీసుల టీఏ, డీఏకు నిధులు విడుదల చేశారని తెలిపారు. సారా వ్యాపారం చేసే బొత్స సత్యనారాయణకు విద్యాశాఖా కట్టబెట్టారని విమర్శించారు.