కేంద్ర మంత్రి గోయల్
ధాన్యం సేకరణలో ఏపీ, తెలంగాణలో అవకతవకలు జరిగినట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహా రావు అడిగిన ప్రశ్నకు మంత్రి గోయల్ సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా తెలుగురాష్ట్రాలు రెండిరటిలోనూ వరి సేకరణలో అవకతవకలు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. అవకతవకలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనే విచారణ చేయాల్సిందిగా కోరామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలే అవకతవకలకు కారణమని జీవీఎల్ ఆరోపించారు. వాటి విచారణ వల్ల ఉపయోగం లేదని, కేంద్ర ప్రభుత్వమే స్వతంత్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, రైతులకు ధాన్యం సేకరించిన మూడు నెలలకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించట్లేదన్నారు. డబ్బుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం చేస్తోందని, దీనిపై కూడ విచారణ జరపాలని మంత్రిని జీవీఎల్ కోరారు.