Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నాకు ప్రాణ హాని ఉంది.. ఎమ్మెల్యే ఆనం

తనకు ప్రాణహాని ఉందని ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ..తనకు సెక్యూరిటీని కూడా తగ్గించారన్నారు. తనను భూమి మీద లేకుండా చేయాలని చూస్తున్నారన్నారు. రెండేళ్ల నుంచి తన ఫోన్‌ ట్యాపింగ్‌ చేస్తున్నారన్నారు. తన రెండు ఫోన్లు ట్యాపింగ్‌ చేశారన్నారు. పీఏతో పాటు తన ఫోన్‌ ను ట్యాపింగ్‌ చేస్తున్నారన్నారు. తనకు ఎలాంటి నేర చరిత్ర లేదన్నారు. సీబీఐ కేసుల్లో తాను హైదరాబాద్‌ చుట్టూ తిరగడం లేదన్నారు. వెంకటగిరిలో రాజకీయ అనిశ్చితి నెలకొందన్నారు. వెంకటగిరి వైసీపీలో మూడు వర్గాలు తయారయ్యాయన్నారు. అధికార పార్టీ పెద్దల నుంచే దుర్మార్గం జరుగుతోందన్నారు. నా పార్టీ వాళ్లే నా ఫోన్‌ ట్యాప్‌ చేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో అందరి భవిష్యత్తు తిరగబడుతుందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img