Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నాడు`నేడుకి ‘లారస్‌ ల్యాబ్స్‌’ రూ.4కోట్ల విరాళం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : నాడునేడు పథకం రెండో విడత కార్యక్రమానికి హైదరాబాద్‌లోని లారస్‌ ల్యాబ్స్‌ యాజమాన్యం భారీ విరాళం అందించింది. ఈ కార్యక్ర మంలో భాగంగా నాలుగు మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో (తెనాలి, కంచికచర్ల, వీరులపాడు, అచ్యుతాపురం, పరవాడ) రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక సదుపాయాలకు లారస్‌ ల్యాబ్స్‌ రూ.4 కోట్ల విరాళం అందించింది. ఈ మేరకు బుధవారం లారస్‌ ల్యాబ్స్‌ ప్రతినిధులు ముఖ్య మంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో కల్సి చెక్కుతో పాటు పనులకు సంబంధించిన పత్రాలను అందజేశారు. మూడు, నాలుగు విడతల్లో అదే మండలాల్లోని మిగిలిన పాఠశాలల్లో నేరుగా లారస్‌ ల్యాబ్స్‌ మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ సీఈఓ డాక్టర్‌ చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావా కృష్ణ చైతన్య, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ చావా నరసింహరావు సీఎంకు తెలి పారు. కార్యక్రమంలో కనెక్ట్‌ టూ ఆంధ్ర సీఈఓ వి.కోటేశ్వరమ్మ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img