ఏపీకి జీవనాడిగా పరిగణిస్తున్న పోలవరం ప్రాజెక్టును టీడీపీ సర్కారు ఏటీఎంగా మార్చుకుందని 2019 ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. నాడు పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారన్న విషయంపై ఇప్పుడు ఏపీ జలవనరుల శాఖ మంత్రిగా కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్న అంబటి రాంబాబు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టులో భాగంగా స్పిల్ వేను కట్టకుండా చంద్రబాబు కాఫర్ డ్యాంను కట్టి డబ్బులు కొట్టేశారని, అందుకే చంద్రబాబు ప్రభుత్వం పోలరవం ప్రాజెక్టును ఏటీఎంగా మార్చుకుందని మోదీ అన్నారని రాంబాబు చెప్పుకొచ్చారు.