తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొవిడ్ బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ట్విటర్ దారా వెల్లడిరచారు. ప్రస్తుతం తాను కోలుకునే వరకూ సెల్ఫ్ ఐసోలేట్ అవుతానని వెల్లడిరచారు. ‘‘నాకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. నాకు కరోనా లక్షణాలేమీ లేవు. అలాగే బాగానే ఉన్నాను. కానీ నేను కోలుకునే వరకూ సెల్ఫ్ ఐసోలేషన్లో ఉంటాను. నన్ను కలిసిన వారంతా వెంటనే టెస్టులు చేయించుకుని.. తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరినీ సేఫ్గా ఉండాలని అర్థిస్తున్నాను’’ అని నారా లోకేష్ ట్వీట్లో పేర్కొన్నారు.