Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

నిజంగా పంట నష్ట పోయిన రైతులను గుర్తించడం లేదు : నక్కా ఆనందబాబు

అకాల వర్షాలకు రైతాంగ తీవ్రంగా నష్టపోయిందని, పంట నష్టం అంచనాలు వేయడంలోనే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు అన్నారు. డెల్టా ప్రాంతంలో 50 శాతం వరి పంటకు నష్టం వాటిల్లిందన్నారు. బాధ్యతగా ఆదుకోవాల్సిన ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందన్నారు. నిజంగా పంట నష్ట పోయిన రైతులను గుర్తించడం లేదని అన్నారు. రాజకీయ ఒత్తిడితో సంబంధం లేని వ్యక్తులను రైతులుగా నమోదు చేస్తున్నారన్నారు. వైసీపీ వారినే బాధితులుగా చేర్చాలని ఎమ్మెల్యేలు పెట్టే ఒత్తిడితో అధికారులు సతమతమవుతున్నారని అన్నారు. రైతుల ధరల స్దిరీకరణ నిధి ఏమైందని ప్రశ్నించారు. రైతు భరోసా కేంద్రాలు ఎవరి కోసమో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు. నిజమైన రైతులను న్యాయం జరగకపోతే పోరాటం చేస్తామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img