Friday, April 19, 2024
Friday, April 19, 2024

నిజమే.. ఆడవారిని ఏడిపించిన వారి పాపాన వారే పోతారు…: రోజా

అసెంబ్లీలో జరిగిన ఘటనపై తిరుపతి వేదికగా నారా భువనేశ్వరి పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై నగరి ఎమ్మెల్యే రోజా స్పందిస్తూ, ఆడవారిని ఏడిపించిన వారి పాపాన వారే పోతారని భువనేశ్వరి అన్న మాటలు నిజమే.. అందుకే 23 అసెంబ్లీ స్థానాలకే తెలుగుదేశం పార్టీ పరిమితం అయ్యింది. చంద్రబాబు వల్లే భువనేశ్వరికి ఏదో ప్రమాదం పొంచి ఉంది.. మీరు (భువనేశ్వరి) జాగ్రత్తగా ఉండాలి. ఎన్టీఆర్‌ను ఏడిపించారు.. నన్ను కూడా ఏడిపించారు. చంద్రబాబు పాలనలో కాల్‌మనీ కేసులో మహిళలు వ్యభిచారం చేయాల్సి వచ్చింది. గోదావరి పుష్కరాల్లో 30 మహిళలు చనిపోయారు.. అప్పుడు భువనేశ్వరి ఎందుకు నోరు తెరవలేదు..?. జరగని దానికి జరిగిందని చంద్రబాబు దొంగ ఏడుపు ఏడ్చారు.. దానిపై భువనేశ్వరి మాట్లాడం అంటే రాజకీయ లబ్ది కోసం భార్యను రోడ్డుకు ఈడ్వడమే’ అని వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img