సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : రాష్ట్రంలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగులు, యువజన, విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోందని, యువతను మరోసారి దగా చేసేందుకు జగన్ సర్కార్ సిద్ధమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు.
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాల భర్తీతో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని గత 40 రోజులకు పైబడి నిరుద్యోగ యువత ఆందోళన చేపట్టిందనీ, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఏపీలో నిరుద్యోగులు, యువజనులు, విద్యార్థులు భగ్గుమంటుంటే, వారిని మరోసారి మోసం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందన్నారు. యువజన, విద్యార్థుల భవిష్యత్తు పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.35 లక్షల ఉద్యోగాల భర్తీతో నూతన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.