Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

నెల్లూరుజిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి అస్వస్థత

చెన్నై అపోలోకి తరలింపు
విశాలాంధ్ర బ్యూరో ..నెల్లూరు : ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్/రెడ్డికి అస్వస్థత. దీంతో ఆయనను హుటాహుటిన నెల్లూరులోని అపోలో హాస్పిటల్ కు తరలించారు. గుండెకు సంబంధించి పలు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు. మరికొన్ని వైద్య పరీక్షలు నిమిత్తం చెన్నైకు తరలించాలని డాక్టర్లు సూచించినట్లు సమాచారం.. గతంలో కూడా శేఖర్ రెడ్డికి ఇదేవిధంగా చెన్నైలో గురి కావడంతో చిన్న అపోలో హాస్పిటల్లో రెండు నెలలు ట్రీట్మెంట్ తీసుకొని కొంతకాలం విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆయన ఇటీవల తిరిగి మరల రాజకీయాలలో చురుగ్గా పాల్గొంటున్నారు అయితే ఇటీవల కాలంలో నియోజకవర్గంలోని వైసిపి నాయకులు మధ్య కొంత విభేదాలు రావడం అదేవిధంగా కుటుంబ సభ్యులకు కూడా కొంత అభిప్రాయ భేదాలు తో ఉన్న చంద్రశేఖర్ రెడ్డికి ఒత్తిడి వలన ఈ గుడ్డి పోటు వచ్చి ఉంటుందని అయితే ఆయన ఆరోగ్యం పరిస్థితి ప్రమాదకరంగా లేదని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img