వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన
నెల్లూరు జిల్లాలో మంత్రుల బృందం శనివారం పర్యటించింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాస్రెడ్డి, మేకపాటి గౌతమ్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. కావలిలో రూ.86 లక్షలతో నిర్మించిన అగ్రి, ఆక్వా కల్చర్ ల్యాబ్, తాళ్లపాలెంలో సచివాలయం, ఆర్బీకే.. తుమ్మలపెంటలో జలజీవన్ మిషన్ను మంత్రులు ప్రారంభించారు.ఆముదాల దిన్నెలో సైడ్ డ్రైన్ను కూడా ప్రారంభించారు.