Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్‌

నేటి(సోమవారం) నుంచి రాష్ట్రవ్యాప్తంగా 18 ఏళ్లు పైబడిన వారికి కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే 44 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సినేషన్‌ ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇకపై 1844 ఏళ్ల వయసు వారికి కూడా టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు.ఎంపిక చేసిన సచివాలయాల ద్వారా 18 నుంచి 44 ఏళ్ల మధ్య వారికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు. ప్రతీ జిల్లాలో అయిదు సెంటర్ల ద్వారా వ్యాక్సినేషన్‌ అందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1844 ఏళ్ల వయసు వారు సుమారు 1.9 కోట్ల మంది ఉన్నట్లు అంచనా. ఒకవైపు వీరికి టీకాలు ఇస్తూనే మరోవైపు ఇతర కేటగిరీలకు రెండో డోసు కొనసాగించేలా చర్యలు చేపట్టారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img