ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం దిల్లీకి బయలుదేరారు.సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ కానున్నారు. ప్రత్యేక హోదా, ఆర్థిక లోటు భర్తీ, రాష్ట్ర విభజన హామీలు, వంటి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా సాయంత్ర 6గంటలకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. రేపు(మంగళవారం) ఉదయం 9.30కు కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.