అసెంబ్లీలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం సందర్భంలో తన సతీమణి భువనేశ్వరిని కించపరిచేలా వైసీపీ నేతలు మాట్లాడారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ఈ ఘటనను ప్రస్తావిస్తూ మీడియా సమావేశంలో కన్నీటిపర్యంతమయ్యారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇలాంటి అవమానాలను ఎదుర్కొనలేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో భువనేశ్వరికి ఎన్టీఆర్ కుటుంబం సంఫీుభావం తెలిపింది. కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత పురంధేశ్వరి ట్విట్టర్ వేదికగా వైసీపీ నేతల వ్యాఖ్యలను ఖండిరచారు.భువనేశ్వరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వైకాపా నేతలు మాట్లాడడం బాధ కలిగించిందన్నారు. వ్యక్తిత్వహననం సహేతుకం కాదన్నారు. తను, భువనేశ్వరి నైతిక విలువలతో పెరిగామని, విలువల్లో రాజీపడే ప్రసక్తే లేదని ట్వీట్ చేశారు.ఆమెతో పాటు నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని భువనేశ్వరికి సంఫీుభావం తెలిపారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమేనని కానీ వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడడం దారుణమని ఆమె మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన వారే దానిని అపహాస్యం చేస్తున్నారన్నారు. తెలుగు ప్రజలందరూ టీడపీ వెంటే ఉన్నారని పేర్కొన్నారు.