Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

నేనెప్పుడూ కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదు..

వైసీపీకి గుండు సున్నానే.. పులివెందులలో కూడా గెలవదు : చంద్రబాబు
వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వచ్చేది.. గుండు సున్నానే అని.. పులివెందులలో కూడా వైసీపీ గెలవదని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు మూడోరోజు పర్యటిస్తున్నారు. రోడ్‌ షో సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తానెప్పుడూ కక్ష సాధింపు రాజకీయాలు చేయలేదన్నారు. పులివెందుల, కుప్పంలో డెవలప్‌మెంట్‌ చేశానన్నారు. పోలీసుల సాక్షిగానే అన్న క్యాంటీన్‌ పై దాడి జరిగిందన్నారు. పోలీస్‌ వ్యవస్థను డీజీపీ భ్రష్టు పట్టించారన్నారు. కుప్పంలో టీడీపీ కార్యకర్తలపై చెయ్యి వేసి సీఎం, డీజీపీ తిరిగి వెళ్లగలరా అన్నారు. ఇక్కడే ఉండి అంతు చూస్తానన్నారు. పోలీసులే రౌడీల వేషంలో వచ్చారన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img