ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. 2020 మార్చి , 2021 జూన్కు సంబంధించి విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా వారి ప్రతిభ ఆధారంగా గ్రేడ్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గ్రేడ్లు ఇచ్చేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గ్రేడ్ కేటాయింపు వల్ల ఏ విద్యార్థికి నష్టం వాటిల్లదన్నారు.