పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లి వచ్చేందుకు వీలుగా ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో పాస్ లేకపోయినా ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీచేసింది. పదోతరగతి పరీక్షలు ఈనెల 27 నుంచి మే 9 వరకు జరగనున్నాయి. ఈ సమయంలో ఉచిత ప్రయణానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. పాస్ లేకపోయినా హాల్టికెట్ ఉంటే ప్రయాణానికి అనుమతించాలని పేర్కొన్నారు. ఈ మేరకు బస్సు ఎక్కకా.. కండక్టర్ కు హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుంది. పల్లెవెలుగు , సిటీ ఆర్డినరీ సర్వీసులకు ఇది వర్తిస్తుంది.రాష్ట్రవ్యాప్తంగా 6.22 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్నారు.