Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పదో తరగతి విద్యార్థులతో లోకేశ్‌ జూమ్‌ మీటింగ్‌.. మధ్యలో ఎంటరైన వల్లభనేని వంశీ, కొడాలి నాని

పదో తరగతి విద్యార్థులతో టీడీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ జూమ్‌ మీటింగ్‌లో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలు జూమ్‌ మీటింగ్‌ మధ్యలో ప్రత్యక్షమయ్యారు. వివరాల్లోకి వెళితే, ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్ష ఫలితాల గురించి నారా లోకేశ్‌ జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. పదో తరగతి పరీక్ష ఫలితాల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అయితే, జూమ్‌ మీటింగ్‌ నడుస్తుండగానే వైసీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలి నానిలు మధ్యలో ఎంటరయ్యారు. వంశీ ఆఫీసులోనే ఉండి ఓ విద్యార్థిని లాగిన్‌ అయింది. దీంతో ఆయన ఈజీగా మీటింగ్‌ లోకి ప్రవేశించారు. లోకేశ్‌తో మాట్లాడే వంతు ఆ విద్యార్థినికి వచ్చిన సందర్భంలో వల్లభనేని వంశీ మాట్లాడే ప్రయత్నం చేశారు. ఆ వెంటనే మాజీ మంత్రి కొడాలి నాని కూడా ఆ జూమ్‌ మీటింగ్‌ లోకి సడన్‌ గా ప్రవేశించారు. . వాళ్లిద్దరూ ఇలా సడన్‌ ఎంట్రీ ఇవ్వడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాన్ఫరెన్స్‌లో వాళ్లు కనిపించడంతో ఇటు టీడీపీ నేతలు మండిపడ్డారు. కాగా, వంశీ జూమ్‌ మీటింగ్‌ లోకి ఎంటరవ్వంగానే నిర్వాహకులు ఆ లైన్‌ వీడియోను కట్‌ చేశారు. కాగా, పదో తరగతి విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు లోకేశ్‌ జూమ్‌ మీటింగ్‌ నిర్వహిస్తే.. కొడాలి నాని, వల్లభనేని వంశీ వెకిలినవ్వులతో శాడిజం చూపించారంటూ టీడీపీ మండిపడిరది. నీచ రాజకీయానికి ఇదా సమయమంటూ ట్వీట్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img