పన్నులు కట్టకపోతే జప్తులు అనేది ఎప్పటి నుంచో ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. సోమవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో మాట్లాడుతూ, కరెంట్ బిల్లు కట్టకపోతే కరెంట్ తీసేస్తామని చెప్పడంలో తప్పేముందని బొత్స ప్రశ్నించారు. ఆస్తుల జప్తు అనేది ఇప్పుడు కొత్తగా రాలేదని అన్నారు. పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని చెప్పడాన్ని తప్పు అంటే ఎలా? అని ప్రశ్నించారు. గత ప్రభుత్వాలు చేసినప్పుడు ఈ విధానాన్ని ఎందుకు ప్రశ్నించలేదని మండిపడ్డారు. ఆస్తులు జప్తు చేయడం తమ ఉద్దేశం కాదని చెప్పారు. పన్నులు కట్టకపోతే స్థానిక సంస్థలు బలోపేతం కాలేవని అన్నారు. పన్నులు కట్టకపోతే అధికారులు నోటీసులు ఇవ్వాలని, ఇంటికి తాళాలు వేయడం సరికాదని చెప్పారు.