Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే

గంటా శ్రీనివాసరావు
ఏపీలో పదో తరగతి పరీక్షలు జరుగుతోన్న విషయం తెలిసిందే. అయితే, పరీక్షల నిర్వహణలో లోపాలు ఉన్నట్టు తరచూ వార్తలు వస్తుండడం ఆందోళన కలిగిస్తోందని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని ఆయన డిమాండ్‌ చేశారు. ‘పదవ తరగతి పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. పరీక్షల నిర్వహణలో లోపాలు ఉన్నట్టు తరచూ వస్తోన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అది విద్యార్థుల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుంది’ అని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img