Tuesday, April 16, 2024
Tuesday, April 16, 2024

పల్నాడు జిల్లా కేంద్రంలో సీఎం జగన్‌ పర్యటన

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి గురువారం పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో పర్యటించనున్నారు. ప్రస్తుతం ఢల్లీి టూర్‌ లో ఉన్న జగన్‌ మరికాసేపట్లో ఏపీ కి రానున్నారు. వచ్చి రాగానే గవర్నర్‌ తో భేటీ కానున్నారు. కేబినెట్‌ మార్పులపై గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంది. ఇక ఎల్లుండి చివరి కేబినెట్‌ సమావేశం కానుంది. ఈ కేబినేట్‌ సమావేశం అనంతరం.. కేబినేట్‌ విస్తారణ జరుగే ఛాన్స్‌ ఉంది. రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి 10.35 గంటలకు నరసరావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 10.50 గంటలకు పీఎన్‌సీ కాలేజీ వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహావిష్కరణ చేయనున్నారు. అనంతరం 11.00 గంటలకు స్టేడియం వద్దకు చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. అదే వేదికపై సీఎం జగన్‌ వలంటీర్లను సత్కరించి ప్రోత్సాహకాలు అందించనున్నారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img