Tuesday, April 23, 2024
Tuesday, April 23, 2024

పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చేయూత : సీఎం జగన్‌

పారిశ్రామికవృద్ధికి ప్రభుత్వం చేయూతనిస్తోందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. ఒక ఇండస్ట్రీ రావడం వల్ల ఎంతో మంచి జరుగుతుందన్నారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో రామ్‌ కో సిమెంట్‌ ఫ్యాక్టరీని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు రైతులు ముందుకొస్తే.. ఎకరాకు ఏడాదికి రూ.30వేల లీజు ఇస్తామన్నారు. కనీసం 2వేల ఎకరాలు ఒక క్లస్టర్‌ గా ఉండాలన్నారు. ఈజీ ఆఫ్‌ డుయింగ్‌ బిజినెస్‌ లో ఏపీ దేశంలోనే ముందు వరుసలో నిలిచిందన్నారు. రామ్‌కో పరిశ్రమతో వెయ్యిమందికి ఉద్యోగాలు వస్తాయని, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌కు ఏపీనే ఉదాహరణ అని సీఎం అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img