ఉద్యోగులకు ఎంత మంచి చేయగలిగే అంత మంచి చేస్తానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పీఆర్సీపై రెండు, రెండు మూడు రోజుల్లో ప్రకటన చేస్తామని ప్రకటించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్తో తాడేపల్లిలోని క్యాంప్ఆఫీస్లో సమావేశమయ్యారు. తాను కూడా మీ అందరి కుటుంబ సభ్యుడినని, మనసా, వాచా మంచి చేయాలనే తపనతో ఉన్నట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్ చేసుకున్నానని తెలిపారు. అన్నింటినీ స్ట్రీమ్లైన్ చేయడానికి అడుగులు ముందుకేస్తామని, మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. దయచేసి అందరూ ప్రాక్టికల్గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని సూచించారు.71 డిమాండ్లతో ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాయి. దీనిపై సీఎస్, ఇతర అధికారులు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదు. వీటిని సత్వరమే పరిష్కరించాలిన ఆయా సంఘాల నేతల సీఎంను కోరుతున్నారు.