Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

పురంధేశ్వరికి క్షమాపణలు చెప్పాల్సిందే..కొడాలి నానికి బీజేపీ నేతల వార్నింగ్‌

తమ పార్టీ జాతీయ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి మాజీ మంత్రి కొడాలి నాని క్షమాపణలు చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. పురంధేశ్వరిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిరచారు. ఈ మేరకు గుడివాడలో మంగళవారం పార్టీ నాయకులతో కలిసి కృష్ణా జిల్లా బీజేపీ అధ్యక్షుడు మట్టా ప్రసాద్‌ మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కొడాలి నాని ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోతే త్వరలోనే మాజీ ఎమ్మెల్యే అయిపోతావని హెచ్చరించారు.దగ్గుబాటి పురంధేశ్వరిపై కొడాలి నాని పరుష పదజాలంతో మాట్లాడడం సరికాదని మట్టా ప్రసాద్‌ అన్నారు. తమ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరికి కొడాలి నాని వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. గుడివాడలో రైల్వే ఫ్లై ఓవర్లు నిర్మించాలని పురంధేశ్వరి ద్వారా కేంద్ర మంత్రికి 2020లో తామే స్వయంగా వినతిపత్రం ఇచ్చామని గుర్తు చేసుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని దగ్గుబాటి పురంధేశ్వరి ఎప్పటికీ అడ్డుకోరని మట్టా ప్రసాద్‌ తెలిపారు. రాజకీయ లబ్ధి కోసం అనవసర వివాదాల్లోకి పురంధేశ్వరిని లాగితే సహించేది లేదని వార్నింగ్‌ ఇచ్చారు. గుడివాడలో ప్రజలకు దూరమైన కొడాలి నాని.. వ్యక్తిగత మైలేజ్‌ పెంచుకోవడం కోసమే పురంధేశ్వరిపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img