శనివారం నుంచి విజయవాడలో స్వరాజ్య మైదానంలో పుస్తక మహోత్సవం జరుగుతుంది.ఈ మహోత్సవం నిర్వహణ కోసం ఆంధ్రప్రదేశ్ గవర్నర్ రూ.5 లక్షలు విడుదల చేశారు.పుస్తక ప్రేమికులైన గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తన విచక్షణాధికారాల మేరకు ఈ నిధులను విడుదల చేసి నూతన సాంప్రదాయానికి నాంది పలికారు. 11 రోజుల పాటు జరిగే పుస్తక మహోత్సవాన్ని జనవరి 1వ తేదీన గవర్నర్ వెబినార్ ద్వారా ప్రారంభించనున్నట్లు గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్వి ఆర్.పి.సిసోడియా తెలిపారు.