లీటర్ పెట్రోల్, డీజిల్్పై రాష్ట్ర ప్రభుత్వం 15 రూపాయలు తగ్గించాలని గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ సైకిల్ తొక్కుతూ వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 22 రాష్ట్రాలు ఇప్పటికే పెట్రోల్, డీజిల్లపై వ్యాట్ తగ్గించాయన్నారు. ఏపీలో పెట్రోల్, డీజిల్్పై రాష్ట్ర ప్రభుత్వం లీటర్కు 40 రూపాయలు పన్నుల రూపంలో వసూలు చేస్తోందని దుయ్యబట్టారు.మాటతిప్పిన, మడమతిప్పిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని అన్నారు. పెట్రోల్, డీజీల్ ధరలు పెంచటం వల్ల వ్యవస్థలన్నీ చిన్నాభిన్నమవుతున్నాయని అన్నారు.ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు నిరసనగా ప్రజలంతా ఉద్యమబాట పట్టి రోడ్లపైకి వస్తున్నారని పేర్కొన్నారు.